About Us

వ్యవస్థాపకులు : శ్రీ మునిశేఖర్ గారు.


యువనేస్తం ఛారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలకు గాను, యువతేజం ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జాతీయ పురస్కారాలలో అవార్డును అందుకుంటున్న యువనేస్తం ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ మునిశేఖర్ గారు. ఆయన విద్యార్ధి దశలో వున్నప్పుడు 2009 వ సంవత్సరం లో Student Federation of India (SFI) లో చేరి శ్రీకాళహస్తి నియెజక వర్గం అధ్యక్షులుగా ఎంపిక అవ్వడం జరిగింది. అప్పటినుంచి పేద విద్యార్థుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్లు, పలకలు, పెన్స్ అందచేయడంకొంతమంది విద్యార్థుల కు ఉచితంగా బస్ పాస్ సౌకర్యాన్ని కల్పించారు. కాలేజ్ విద్యార్థులకు క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించడంస్వాతంత్ర్య సమరయోధుల జయంతి, వర్ధంతులను నిర్వహించడంతోపాటు పరిసర గ్రామాల్లో ఉన్న సమస్యలపై ఎన్నో సార్లు ప్రభుత్వ అధికారులకు విన్నవించి, సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. ఇలా సమాజానికి సేవ చెయ్యాలనే ఆలోచనతో తన వంతు కృషిగా యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించారు. 

సంస్థ అంకురార్పణ: 

                          మనచుట్టూ వుండే పేదవాళ్ళువికలాంగులు ఎంతో మంది ఒక పూట తిని రెండుపూటలా పస్థులు ఉండే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్లను ఆదుకోవాలి అనే ఆలోచనతో సంస్థ వ్యవస్థాపకులు మునిశేఖర్ గారు 11-11-2109వ తేదీన 4 గురు సభ్యులతో కలసి యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్  ద్వారా అనాధలకువికలాంగులకు మరియు నిరుపేదలకు ఆశ్రయం కల్పించడానికి  రాబోయే రోజుల్లో ఆంద్రప్రదేశ్ లోని అన్నీ జిల్లాలోనూ ఆశ్రమాలు ఏర్పాటు చేయాలి అని, మరియు ప్రభుత్వాలు పేదవారికి ప్రవేశపెట్టే పథకాలను ప్రజల దృష్టి కి తీసుకుపోవడం లాంటి కార్యక్రమాలు యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది.



No comments:

Post a Comment