ఈ రోజు 02.05.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు ఏర్పేడు మండలం అముడూరు పంచాయితీ ST కాలనీలో ఉన్న కుటుంబాలకు మరియు హరిజన వాడలో ఉన్న నిరుపేదలకు కలిపి 35 కుటుంబాలకు సిర్డ్స్ సేవ సంస్థ ఆర్ధిక సహాయంతో ,నూనె ప్యాకెట్స్, నిత్యావసర వస్తువులు మరియు 5 కేజీల బియ్యం ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు,రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు,జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు తెలిపారు,ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ అముడూరు పంచాయతీ ST కాలనీ,హరిజన వాడ,మరియు రోడ్ సైడ్ లో అక్కడక్కడ ఉన్న నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని తెలిపారు,ఈ కార్యక్రమానికి చెన్నై లో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాసులు గారు 150 కేజీల బియ్యం ట్రస్ట్ కి అందచేసారని మరియు వే ఫౌండేషన్ అంకయ్య గారు 40 కేజీల బియ్యం అందచేసారని తెలిపారు, నిరుపేదలకు,అనాధులకు సహాయం చేయడానికి ధాతలు ముందుకు రావాలని కోరారు, సహాయం చేయడానికి ముందుకొచ్చిన దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు,దాతలు ఆర్థికంగాను లేదా నిత్యావసర వస్తువులు ఎవరైనా సహాయం చేయాలనుకున్నవారు 8466060513 ఈ నెంబర్ కి పోన్ చేయవలచిందిగా కోరుతున్నాము,ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మణిగారు,రాజేంద్ర గారు,గురుతేజ గారు,పనేంద్ర గారు,గురుసాయి గారు,గురవయ్య గారు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment