Thursday, 21 May 2020

యువనేస్తం ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు చేయూత.



                           ఈ రోజు 20.05.2020  యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో   ఉదయం 11గంటలకు  శ్రీ కాళహస్తి మండలంలోని కొండమిట్ట, వాటర్ వర్క్ కాలనీ, పొన్నాలమ్మ వీధి,పానగల్ వీధి, బీపీ అగ్రహారం ST కాలనీ లలో ఉన్నకొంతమంది ఆటో కార్మికులకు, నిరుపేదలకు 10 కేజీల బియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు, శాని టైజర్లు పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ ఆటో తోలుకునే కార్మికులు, రోజు వారి కూలీలు లాక్ డౌన్ వలన చాలా ఇబ్బందులు పడుతున్నారని  తెలిపారు. అనాధులకు, నిరుపేదలకు దాతల సహయంతో  సహాయం చేయడమే యువనేస్తం ట్రస్ట్  లక్ష్యం అని తెలిపారు. ప్రతీ ఒక్కరు నిత్యావసర వస్తువుల కోసం రోడ్ పైకి వచ్చేటప్పుడు  మాస్కులు వేసుకొని సామాజిక దూరం పాటించి కరోనా వైరస్ ను తరిమి కొట్టాలని కోరారు. దాతలు ఆర్థికంగాను లేదా నిత్యావసర వస్తువులు ఎవరైనా సహాయం చేయాలనుకున్నవారు యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ కి  సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గారు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment