ఈ రోజు 26.05.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు ఏర్పేడు మండలం మెర్లపాక పంచాయితీ ST కాలనీలో ఉన్న నిరుపేద కుటుంబాలకు బియ్యం, కూరగాయలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు, జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు నిత్యావసర వస్తువుల కోసం రోడ్ పైకి వచ్చేటప్పుడు మాస్కులు వేసుకొని సామాజిక దూరం పాటించి కరోనా వైరస్ ను తరిమి కొట్టాలని కోరారు. మేర్లపాక గ్రామానికి దూరంగా నిరుపేదవాళ్ళు మరియు తల్లిదండ్రులు లేని పిల్లవాళ్లు కూడా ఉన్నారని వారు గుడిసెల్లో నివసిస్తున్నారని వాళ్ళుచాలా ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళకి సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మణి, ట్రస్ట్ సభ్యురాలు మునెమ్మ గారు, సుదీర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment