ఈ రోజు 11.05.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉదయం 10గంటలకు ఏర్పేడు మండలం నచ్చనేరి పంచాయితీ ST కాలనీలో ఉన్న కుటుంబాలకు సిర్డ్స్ సేవ సంస్థ ఆర్ధిక సహాయంతో నిత్యావసర వస్తువులు మరియు దాతల సహాయతో బియ్యం ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు,జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ గ్రామాలకు దూరంగా నిరుపేదవాళ్ళు గుడిసెల్లో నివసిస్తున్నారని వాళ్ళు లాక్ డౌన్ వలన చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.సహాయం చేయడానికి ముందుకొచ్చిన దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు,దాతలు ఆర్థికంగాను లేదా నిత్యావసర వస్తువులు ఎవరైనా సహాయం చేయాలనుకున్నవారు 8466060513 ఈ నెంబర్ కి పోన్ చేయవలచిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో లోకేష్ గారు, కిరణ్ గారు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment