ఈ రోజు 13.05.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉదయం 10గంటలకు ఏర్పేడు మండలం అంజిమేడు పంచాయితీ పోతుమాలగుంట ST కాలనీలో ఉన్న కుటుంబాలకు కూరగాయలు, కోడిగుడ్లు దాతల సహాయంతో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు, జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం చేయడమే యువనేస్తం ట్రస్ట్ లక్ష్యం అని తెలిపారు. ప్రతీ ఒక్కరు నిత్యావసర వస్తువుల కోసం రోడ్ పైకి వచ్చేటప్పుడు మాస్కులు వేసుకొని సామాజిక దూరం పాటించి కరోనా వైరస్ ను తరిమి కొట్టాలని కోరారు. మెయిన్ రోడ్ కి దూరంగా పోతుమాల గుంట దగ్గర నిరుపేదవాళ్ళు గుడిసెల్లో నివసిస్తున్నారని వాళ్ళు లాక్ డౌన్ వలన చాలా ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళకి సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. సహాయం చేయడానికి ముందుకొచ్చిన దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. దాతలు ఆర్థికంగాను లేదా నిత్యావసర వస్తువులు ఎవరైనా సహాయం చేయాలనుకున్నవారు 8466060513 ఈ నెంబర్ కి పోన్ చేయవలచిందిగా కోరుతున్నాము,ఈ కార్యక్రమంలో లోకేష్ గారు, కిరణ్ గారు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment