ఈ రోజు 14.05.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉదయం 11గంటలకు కాళహస్తి మండలం ఇసుకదిబ్బ,V. M. పల్లి పరిధిలోని తల్లి దండ్రులు లేని అనాధులకు సిర్డ్స్ సేవ సంస్థ సహకారంతో 10 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు, కోడిగుడ్లు, మాస్కులు పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు & చైర్మన్ మునిశేఖర్ గారు, జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ అనాధులు గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదవాళ్ళు లాక్ డౌన్ వలన చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు లేని అనాధులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడు యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. దాతలు ఆర్థికంగాను లేదా నిత్యావసర వస్తువులు ఎవరైనా సహాయం చేయాలనుకున్నవారు 8466060513 ఈ నెంబర్ కి పోన్ చేయవలచిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గారు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment