ఈ రోజు 12.04.2020 మధ్యాహ్నం యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 170 భోజనం ప్యాకెట్లను ఏర్పేడులో ఉన్న పోలీసులకు ,అనాధులకు, నిరుపేదవాళ్లకు ,లారీ డ్రైవర్లకు గౌరవనీయులు C. I. శివకుమార్ రెడ్డి గారి చేతులమీదుగా పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు ,రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు, జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు, దయాకర్ గారు తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ ప్రతీ రోజు ఒకపూట అయిన అనాధులకు, నిరు పేదలకు భోజనం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతోనే భోజనం ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు, కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైనదని అందుకనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పొడిగించాయని ప్రజలందరూ తప్పకుండా పాటించి ఇంటిలోనే ఉండి కరోనా వైరస్ ను తరిమి కొట్టాలని కోరారు. లాక్ డౌన్ వలన అనాధులు,నిరుపేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని వాళ్లకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు, సిఇ శివకుమార్ రెడ్డి గారికి ఈ అన్నదాన కార్యక్రమాలకు సహకరించినటువంటి S. V. కెటరింగ్ దయాకర్ గారికి మరియు నిరంతరం కృషి చేస్తున్న సభ్యులకు ,దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
No comments:
Post a Comment