Monday, 20 April 2020

దాతల సహాయంతో యువనేస్తం ఆధ్వర్యంలో వలస కూలీలకు 50 కేజీల బియ్యం మరియు నిత్యావసర వస్తువుల పంపిణీ.


               ఈ రోజు 19.04.2020  యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  ఉదయం 11 గంటలకు సిద్ధయ్యగుంట గ్రామానికి జయచంద్ర గారు, ధనలక్మి గారు సహయంతో ఏర్పేడు మండలం  పంగూర్  గ్రామంలో ఉన్న బీహార్  కూలీలకు 50 కేజీల బియ్యం, 5 కేజీల కందిపప్పు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని  ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు, జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు ,దయాకర్ గారు తెలిపారు,ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ అనాధులకు, నిరుపేదవాళ్ళకు సహాయం చేయడానికి ఎల్లప్పుడు యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంటామని తెలిపారు. నిరుపేదలకు, అనాధులకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు,దాతలు ఆర్థికంగాను, నిత్యావసర వస్తువులు ఎవరైనా సహాయం చేయాలనుకున్న 8466069513 ఈ నెంబర్ కి పోన్ చేయవలచిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో భార్గవ్ గారు తదితరులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment