ఈ రోజు 24.04.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ మరియు సిర్డ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు ఏర్పేడు మండలం పాతవీరాపురం గ్రామం ST కాలనీలో ఉన్న 35 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు, జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు తెలిపారు,ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ అనాధులకు, నిరుపేదవాళ్ళకు సహాయం చేయడానికి ఎల్లప్పుడు యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంటామని తెలిపారు. నిరుపేదలకు, అనాధులకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. దాతలు ఆర్థికంగాను లేదా నిత్యావసర వస్తువులు ఎవరైనా సహాయం చేయాలనుకున్నవారు 8466060513 ఈ నెంబర్ కి పోన్ చేయవలచిందిగా కోరుతున్నాము. సేవా కార్యక్రమాలకు సహాయం చేస్తున్న దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మణి, జయసెంకర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment