Saturday, 25 April 2020

యువనేస్తం మరియు సిర్డ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో కందాడ పంచాయతీ ST కాలనీలో ఉన్న చిన్న పిల్లలకు జ్యూస్, బాదంపాలు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ.


              ఈ రోజు 25.04.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ మరియు సిర్డ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పేడు మండలం కందాడ పంచాయితీ ST కాలనీలో ఉన్న చిన్నపిల్లలకు బిస్కెట్లు ,బాదంపాలు,జ్యుస్ ప్యాకెట్స్ రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు, మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు పంపిణీ చేశారని యువనేస్తం ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు తెలిపారు. ఈ సందర్భంగా  మునిశేఖర్ గారు మాట్లాడుతూ కరోనా వైరస్ ను తరిమికొట్టాలంటే  ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ ను ప్రజలందరూ తప్పకుండా పాటించాలని కోరారు. ఈ లాక్ డౌన్ వలన నిరుపేదవాళ్ళు నిత్యావసర వస్తువులు కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. నిరు పేదలకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. దాతలు సహాయం చేయాలనుకున్నవారు 8466060513 ఈ నెంబర్ కి పోన్ చేయవలచిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో  శీను తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment