ఈ రోజు 28.04.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిర్డ్స్ సేవా సంస్థ ఆర్ధిక సహయంతో ఉదయం 11 గంటలకు ఏర్పేడు మండలం మోదుగుల పాళ్లెం పంచాయితీ కుమ్మరిమిట్ట ST కాలనీలో ఉన్న 33 కుటుంబాలకు 5కేజీల బియ్యం, నూనె ప్యాకెట్స్ మరియు నిత్యావసర వస్తువులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు,రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు, జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు తెలిపారు,ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ అనాధులకు, నిరుపేదవాళ్ళకు సహాయం చేయడానికి ఎల్లప్పుడు యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ రోజు సౌటూర్ గ్రామం నుంచి గురవయ్య గారు 120 కేజీల బియ్యం, సిద్ధయ్యగుంట గ్రామం నుంచి ఈశ్వర్ గారు 30 కేజీల బియ్యం ట్రస్ట్ కి అందచేసారని తెలిపారు. నిరుపేదలకు, అనాధులకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. సహాయం చేయడానికి ముందుకొచ్చిన సిర్డ్స్ సేవా సంస్థ వారికి మరియు గురవయ్య గారికి,ఈశ్వర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు,దాతలు ఆర్థికంగాను లేదా నిత్యావసర వస్తువులు ఎవరైనా సహాయం చేయాలనుకున్నవారు 8466060513 ఈ నెంబర్ కి పోన్ చేయవలచిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో అంగణవాడి టీచర్ భారతి గారు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment