ఏర్పేడు లో ఈ రోజు 16.04.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేణిగుంటలోని నాగార్జున స్కూల్ అధినేత బాస్కర్ రెడ్డి గారి సహాయంతో పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు మాస్కులు, సానిటీజర్లు, అరటిపండ్లు పంపిణీ చేశామని ఈ సందర్బంగా గౌరవనీయులు సిఐ శివకుమార్ రెడ్డి గారికి అందచేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు, జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు ,దయాకర్ గారు తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ పేదలకు,అనాధులకు అవసరం ఉన్నప్పుడల్లా సేవ చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు, కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైనదని అందుకనే ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పొడిగించాయని ప్రజలందరూ తప్పకుండా పాటించి ఇంటిలోనే ఉండాలని కోరారు,లాక్ డౌన్ వలన అనాధులు ఆకలితో చాలా ఇబ్బంది పడుతున్నారని అనాధులకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. ట్రస్ట్ సభ్యులకు,దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment