Wednesday, 15 April 2020

యువనేస్తం తరపున సిద్ధయ్యగుంట గ్రామస్తులు అనాధలకు, పారిశుద్ధ్య కార్మికులకు 200 భోజనం పాకెట్ల వితరణ.


                    ఏర్పేడు లో ఈ రోజు 15.04.2020 మధ్యాహ్నం యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిద్ధయ్యగుంట గ్రామానికి చెందిన అరుణ గారు,జయమునిప్రకాష్ గారు,సుబ్బమ్మ గారు వారి సొంత ఖర్చుతో 200 భోజనం ప్యాకెట్లను ఏర్పేడులో ఉన్న అనాధులకు  ,పారిశుధ్య కార్మికులకు భోజనం ప్యాకేట్లను పంపిణీ చేశామని  ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు,జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు ,దయాకర్ గారు తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ ప్రతీ రోజు ఒకపూట అయిన అనాధులకు భోజనం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతోనే  రోజు లాగానే ఈ రోజు కూడా ఏర్పేడులో  భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశామని తెలిపారు. కరోనా వైరస్ చాలా  ప్రమాదకరమైనదని అందుకనే ప్రభుత్వాలు  లాక్ డౌన్ ను పొడిగించాయని ప్రజలందరూ తప్పకుండా పాటించి ఇంటిలోనే ఉండాలని కోరారు. లాక్ డౌన్ వలన అనాధులు ఆకలితో చాలా ఇబ్బంది పడుతున్నారని అనాధులకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. అనాధులకు సహాయం చేయడానికి ముందుకొచ్చిన అరుణ గారికి,జేయమునిప్రకాశ్ గారికి ,సుబ్బమ్మ గారికి ప్రత్యేకంగా  ట్రస్ట్ తరుపున ధన్యవాదాలు తెలిపారు ,మరియు ట్రస్ట్ సభ్యులకు,దాతలకు ప్రత్యేకంగా  ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈశ్వర్ గారు, భార్గవ్, విజేయ్ బాబు గారు, భార్గవ్ గారు, ధనంజేయులు గారు తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment